ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపర్చాయని అన్నారు. ఎంతో మంచి చేసినా కూడా ఓటమి తప్పలేదన్నారు. అక్కాచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయే తెలియడం లేదని చెప్పారు.
అమ్మ ఒడిని 53 లక్షల మంది తల్లులు అందుకున్నారని తెలిపారు. పిల్లలు బాగుండాలని అడుగులు వేశామని చెప్పారు. పిల్లల చదువు కోసం ఏ తల్లీ అవస్థ పడకూడదని అనుకున్నామని తెలిపారు. సచివాలయ వ్యవస్థను, వాలంటరీల వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు.
Also Read: మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ భావోద్వేగం.. కన్నీళ్లు ఆపుకుంటూ..