అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టను : జేసీ ప్రభాకర్ రెడ్డి

ఇసుక ఎట్లా అమ్మాలో నాకు తెలుసు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టను. మీరేనా డబ్బులు సంపాదించుకునేది ..

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy : అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమంగా 25 మంది రవాణా చేస్తున్నారని అన్నారు. గతంలో అక్రమ ఇసుక అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదు. నాకోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. ఇసుక రవాణా చేసి నాకు దూరం కావొద్దంటూ జేసీ సూచించారు.

 

ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తాం అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇసుక ఎట్లా అమ్మాలో నాకు తెలుసు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టను. మీరేనా డబ్బులు సంపాదించుకునేది మిగతావారు లేరా? అంటూ కొందరు టిప్పర్ ఓనర్లపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు