Liquor Alipiri : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరిలో భారీగా మద్యం పట్టుబడింది. తిరుమలకు తరలిస్తున్న 20 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర బెంగళూరుకి చెందిన వెంకటేశ్ నుంచి మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. వెంకటేశ్ తిరుమలలో సివిల్ వర్కర్ గా పని చేస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు.. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు అప్పగించారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
గతంలో ఎన్నడూ లేని విధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 20 మద్యం బాటిళ్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి తిరుమలలో ఓ కాంట్రాక్టర్ వద్ద సివిల్ వర్కర్ గా పని చేస్తాడు. వెంకటేశ్ తిరుమలకు వెళ్తూ తనతో పాటు 20 మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వెంటనే వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు.. అతడిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాగా, ఇలా మద్యం తరలిస్తుండగా పట్టుబడటం గత వారం రోజుల్లో ఇది రెండోసారి.
Hawala Cash : చొక్కా విప్పితే లక్షల గుట్టు రట్టు-చెన్నైలో హవాలా మనీ స్వాధీనం
తిరుమలలో గట్టి నిఘా ఉన్నప్పటికి.. ఇంకా కొంతమంది వారి కన్నుకప్పి తిరుమలకు గుట్టుగా మద్యం తరలిస్తున్నారు. మద్యం సేవించడం, అమ్మడం వంటి పనులు చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటం అధికార వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
Missing Woman : 48 గంటల్లో నా భార్య ఆచూకీ తెలపకపోతే… మా శవాల లోకేషన్ షేర్ చేస్తాను