Home Isolation
Home Isolation: ఆంధ్రప్రదేశ్ లో అందిన తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్ బాధితులు హోం ఐసొలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిత్యం పర్యవేక్షిస్తూ సకాలంలో స్పందిస్తుననారు. 104 కాల్సెంటర్ వైద్యులు ఫోన్ ద్వారా ఆరోగ్య సమాచారం తెలుసుకుని సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మరోవైపు కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.
ప్రస్తుతం 9వేల 937 మంది బాధితులు కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల యాక్టివ్ కేసుల్లో 37వేల 760 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య పెరిగితే.. ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ లక్షణాలు బయటపడగానే జాప్యం చేయకుండా 104కు కాల్ చేసి మందుల వివరాలు తెలుసుకోవడం లేదంటే కోవిడ్ కేర్ సెంటర్కు రావాలని సూచిస్తున్నారు.
మానసిక ఆందోళనతోనే చాలామంది ఆస్పత్రులకు వస్తున్నారని అంటున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రంలో 558 ఆస్పత్రులు కోవిడ్ చికిత్స అందిస్తుండగా.. 44వేల 559 పడకలు అందుబాటులో ఉన్నాయి.
ఆయాసం ఎక్కువ ఉంటే..
సాధారణ మందులు వాడి కరోనా నుంచి కోలుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు. మానసికంగా కుంగిపోకుండా ఆయాసం ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రులకు వెళ్లమని నిపుణులు చెబుతున్నారు.