Narendra Modi : ప్రధానమంత్రి మోదీ ఏపీ పర్యటన ఖరారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.

స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జూలై 3న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆరాత్రికి అక్కడే బస  చేసి జులై 4 ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు.

అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం గం.10-50కి భీమవరం చేరుకుంటారు. అక్కడ అల్లూరి సీతారామరాజు  విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసగింస్తారు.  అనంతరం విజయవాడ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలు దేరి వెళతారని అధికార వర్గాలు  వెల్లడించాయి.

Also Read : Honey Trap : హోం గార్డులతో కలిసి లేడీ ఎస్సై పాడు పని….అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు