Honey Trap : హోం గార్డులతో కలిసి లేడీ ఎస్సై పాడు పని….అరెస్ట్
ఉత్తర ప్రదేశ్లోని ఒక మహిళా ఎస్సై... వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వ్యాపారస్తులను వదిలిపెట్టటానికి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
Honey Trap : ఉత్తర ప్రదేశ్లోని ఒక మహిళా ఎస్సై… వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వ్యాపారస్తులను వదిలిపెట్టటానికి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
కాన్పూర్ లోని ఒక హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసు కమీషనర్ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో డిప్యూటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలోని ఒక మహిళా ఎస్సై, కొత్వాలి పోలీసు స్టేషన్ కు చెందిన ఇద్దరు హోం గార్డులను తీసుకుని వెళ్లి హోటల్ పై దాడి చేసింది.
అక్కడ ఆమెకు వ్యభిచారం చేస్తూ ఇద్దరు వ్యాపారస్తులు పట్టుబడ్డారు. వారిద్దరూ జలౌన్ జిల్లాకు చెందిన వారుగా తెలుసుకుంది. వారిద్దరిని తన కారులో ఎక్కించుకుని వారిపై వ్యభిచారం చట్టం కింద కేసు బుక్ చేస్తున్నట్లు తెలిపింది.
వారిపై కేసు లేకుండా విడిచి పెట్టాలంటే వారు రూ. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వారు అందుకు అంగీకరించలేదు. దీంతో వారిని తన కారులోనే దాదాపు మూడు గంటలపాటు బందీగా ఉంచి వారిని డబ్బులు డిమాండ్ చేయసాగింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు … మీ పరువు పోతుందని బెదిరిస్తూ వారిని డబ్బులు ఇవ్వమని వత్తిడి చేయసాగింది.
అయినా వారు ఒప్పుకోక పోవటంతో వారిని ఒక ప్రత్యేక ప్రదేశంలో బంధించింది. ఈ క్రమంలో వ్యాపారస్తులు ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. కాన్పూర్ పోలీసు కమీషనర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరిగినదంతా వివరించారు. దీంతో పోలీసు కమీషనర్ ఆదేశాలతో ఎస్సైను, హోం గార్డులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Kerala : డ్రగ్స్ కేసులో నిందితుడైన ప్రముఖ నటుడు ఆత్మహత్య