Telugu » Andhra-pradesh » Rathasapthami Celebrations To Be Held In Tirumala On January 25 Ve
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. 25న రథసప్తమి వేడుకలు.. పలు సేవలు, దర్శనాలు రద్దు
రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
Tirumala: తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. సప్తవాహనాలపై మాడవీధుల్లో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రథసప్తమిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.