శ్రావణమాసం వంటలు..ఆరోగ్యం

  • Published By: madhu ,Published On : July 21, 2020 / 01:44 PM IST
శ్రావణమాసం వంటలు..ఆరోగ్యం

Updated On : July 21, 2020 / 3:20 PM IST

సాధారణముగా పండుగలన్నీ జాతి మత పరంగా జరుపుకుంటుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే ఉంది. ఈ పండుగల సందర్భంగా ప్రతి ఇంట్లో వండే వంటల ద్వారా ఘుమఘుమలు వస్తుంటాయి. పండుగల ద్వారా వండే వంటల ద్వారా ఆరోగ్యం రహస్యం దాగి ఉందని అంటున్నారు.

ప్రస్తుతం ఆషాడం పోయి శ్రావణం వచ్చింది. ఇక ఈ నెల అంతా సందడే సందడిగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభంలో అనేక రోగాలు వ్యాపిస్తుంటాయి. అవసరమైన రోగ నిరోధక శక్తి ఈ శ్రావణ మాసం ద్వారా లభిస్తుందని కొంతమంది అంటుంటారు.

వరలక్ష్మీ వ్రతం, ఇతర నోమాలు, వ్రతాలు ఆచరిస్తుంటారు. ఈ కాలంలో లభించే పండ్లు, వివిధ పుష్పాలు నివేదిస్తారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన ప్రసాదాలు చేస్తుంటారు. ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారని వెల్లడిస్తున్నారు.

తొమ్మిది రకాల పిండివంటలు :

  1. పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేస్తారు. వీటిని తినడం  రా ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి.
  2. పులగం : బియ్యం , పెసరపప్పులను కలుపుతారు. గ్లాసు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు, తగినంత పంచదార, జీలకర్ర వేస్తారు.. ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా మేధస్సు వికసిస్తుంది.
  3. గారెలు : మినపపప్పు, కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు. ఇందులో వేసే పదార్థాల ద్వారా ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి.
  4. పరమాన్నము : పాలు, బియ్యం, శక్కర, ఇలాయిచీ, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేస్తుంటారు. పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్ని, పంచదార.. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది. దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది.
  5. చక్కెర పొంగలి : బియ్యము, పాలు, నెయ్యి, పెసరపప్పు, జీడిపప్పు, కిస్ మిస్, మిరియాలు వేస్తారు. దీనిని తినడం వల్ల మెదడు, ఇతర అవయవాలు చురుకుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
  6. పులిహోరా : అన్నం వండి అందులో పసువు, జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, ఎండు మిరప, ఆవాలు, జిలకర, ఆవాలు, శొంఠి…వేసి తయారు చేస్తారు. దీనిని తినడం వల్ల శరీరములో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  7. చిట్టి బూరెలు : మినపపప్పు ముద్దగా చేసి ఇందులో కొద్దిగ మజ్జిగ కలుపుతారు. చిన్న చిన్న బూరెల్లా వేయించి చేస్తారు. చలువ చేస్తుంది.
  8. పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేస్తారు. ఇతర పదార్థాలు కలపడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి.
  9. గోధుమ ప్రసాదము : గోధుమ రవ్వ, పంచదార, నెయ్యి, మిశ్రమముతో తయారుచేస్తారు. ఇది బలమైన ఆహారం.