Srisailam Elevated Corridor: శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌లో మార్పులు.. 2 లేన్లు కాదు 4 లేన్లుగా.. కేంద్రం కీలక నిర్ణయం

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (Srisailam Elevated Corridor)ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Srisailam elevated corridor expanded 4 lane project nhai new dpr details

  • శ్రీశైలం కారిడార్ నాలుగు లేన్లు
  • ఎన్‌హెచ్‌ఏఐ చేతికి నిర్మాణ బాధ్యతలు
  • భవిష్యత్తు ట్రాఫిక్‌కు అనుగుణంగా మార్పులు

Srisailam Elevated Corridor: హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు రూపుదిద్దుకుంటున్న శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మోర్త్‌ పరిధిలో ఉన్న 54 కిలోమీటర్ల ఈ కారిడార్‌(Srisailam Elevated Corridor)ను పనుల పర్యవేక్షణ అనువుగా ఉండేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్‌ఏఐ (NHAI)కి బదిలీ చేసింది. దీనివల్ల ప్రాజెక్టు సమగ్ర నివేదికల నుంచి టెండర్ల ప్రక్రియ వరకు అన్ని వ్యవహారాలు ఒకే విభాగం కిందకు రానున్నాయి.

Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. పోటాపోటీగా తెదేపా-వైకాపా కార్యక్రమాలు.. రంగంలోకి భారీ పోలీసు బలగాలు

2 లేన్ల నుంచి 4 లేన్లకు ప్రతిపాదన:

భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను 2 లేన్లకు బదులుగా 4 లేన్లుగా నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రతిపాదించారు. ఒకే పిల్లర్‌పై రెండు వైపులా ప్రయాణించేలా నిర్మించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక, టెండర్ల సమస్యలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ విస్తరణ వల్ల దాదాపు 2 లక్షల చెట్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, అధికారులు కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు.

నిధుల సమీకరణ, రాష్ట్ర వాటా:

గతంలో ఉన్న 2 లేన్ల నివేదిక ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 50% ఖర్చును భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందులో రూ. 2,541 కోట్లను నేరుగా అందించడంతో పాటు మిగిలిన వాటాను పన్ను మినహాయింపుల రూపంలో ఇవ్వడానికి సిద్ధపడింది. తాజాగా ప్రాజెక్టు ఎన్‌హెచ్‌ఏఐకి మారడం, 4 లేన్ల ప్రతిపాదన రావడంతో పెరిగే వ్యయంపై కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య త్వరలోనే చర్చలు జరగనున్నాయి.