Srisailam Elevated Corridor: శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లో మార్పులు.. 2 లేన్లు కాదు 4 లేన్లుగా.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (Srisailam Elevated Corridor)ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
- V Santhosh Kumar
- Published on- August 10, 2026 / 11:42 AM IST
Srisailam elevated corridor expanded 4 lane project nhai new dpr details
- శ్రీశైలం కారిడార్ నాలుగు లేన్లు
- ఎన్హెచ్ఏఐ చేతికి నిర్మాణ బాధ్యతలు
- భవిష్యత్తు ట్రాఫిక్కు అనుగుణంగా మార్పులు
Srisailam Elevated Corridor: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు రూపుదిద్దుకుంటున్న శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మోర్త్ పరిధిలో ఉన్న 54 కిలోమీటర్ల ఈ కారిడార్(Srisailam Elevated Corridor)ను పనుల పర్యవేక్షణ అనువుగా ఉండేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఏఐ (NHAI)కి బదిలీ చేసింది. దీనివల్ల ప్రాజెక్టు సమగ్ర నివేదికల నుంచి టెండర్ల ప్రక్రియ వరకు అన్ని వ్యవహారాలు ఒకే విభాగం కిందకు రానున్నాయి.
2 లేన్ల నుంచి 4 లేన్లకు ప్రతిపాదన:
భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలివేటెడ్ కారిడార్ను 2 లేన్లకు బదులుగా 4 లేన్లుగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రతిపాదించారు. ఒకే పిల్లర్పై రెండు వైపులా ప్రయాణించేలా నిర్మించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక, టెండర్ల సమస్యలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ విస్తరణ వల్ల దాదాపు 2 లక్షల చెట్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, అధికారులు కొత్త డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు.
నిధుల సమీకరణ, రాష్ట్ర వాటా:
గతంలో ఉన్న 2 లేన్ల నివేదిక ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 50% ఖర్చును భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందులో రూ. 2,541 కోట్లను నేరుగా అందించడంతో పాటు మిగిలిన వాటాను పన్ను మినహాయింపుల రూపంలో ఇవ్వడానికి సిద్ధపడింది. తాజాగా ప్రాజెక్టు ఎన్హెచ్ఏఐకి మారడం, 4 లేన్ల ప్రతిపాదన రావడంతో పెరిగే వ్యయంపై కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య త్వరలోనే చర్చలు జరగనున్నాయి.
