Ap Liquor Scam: ఏపీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు సుప్రీం నోటీసులు.. విచారణపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్లో మద్యం(Ap Liquor Scam) అక్రమ రవాణా కేసులో రాజ్ కసిరెడ్డి, డి. వాసుదేవరెడ్డిల అరెస్టుల వ్యవహారం ఇప్పుడు అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది.
- V Santhosh Kumar
- Published on- August 31, 2026 / 05:03 PM IST
Supreme court issues notice to raj kasireddy and vasudeva reddy in ap liquor scam
- సుప్రీంకోర్టుకు చేరిన మద్యం కేసు
- నిందితులకు నోటీసులు జారీ చేసిన సీజేఐ
- హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సవాల్
Ap Liquor Scam: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం అక్రమ రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, డి. వాసుదేవరెడ్డిల అరెస్టుల వ్యవహారం ఇప్పుడు అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) నేతృత్వంలోని ధర్మాసనం శోధనాత్మక విచారణను ప్రారంభించగా, రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
హైకోర్టు తీర్పు – సీజేఐ ధర్మాసనం నోటీసులు:
గతంలో ఈ కేసు(Ap Liquor Scam) విచారణలో పోలీసులు ప్రాథమిక నిబంధనలను పాటించలేదన్న కారణంతో ఏపీ హైకోర్టు నిందితులకు ఉపశమనం కలిగిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సీజేఐ ధర్మాసనం, ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణపై ఉత్కంఠ:
ప్రభుత్వం తరఫున వ్యక్తమైన అభ్యంతరాలను, న్యాయవాదుల వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. రాబోయే విచారణలో ఈ కేసుకు సంబంధించిన విచారణాధికారుల తీరు, రవాణా అక్రమాల ఆధారాలను సుప్రీంకోర్టు సమగ్రంగా పరిశీలించనుంది.
