×
Ad

Swachh Bharat Awards : ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట

ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పడింది. 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు లభించింది.

  • Published On : November 20, 2021 / 06:10 PM IST

Ap

Swachh Bharat Awards for AP : ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పడింది. 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో విజయవాడకు మూడో ర్యాంకు వచ్చింది. నెల్లూరు కార్పొరేషన్ కు సఫాయి మిత్ర చాలెంజ్ లో మొదటి అవార్డు లభించింది.

నెల్లూరుకు రూ.10 కోట్ల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి కార్పొరేషన్ కు గార్బేజ్ ఫ్రీ సిటీ, సిటిజన్ ఫీడ్ బ్యాక్, త్రీ స్టార్ రేటింగ్, సఫాయి మిత్ర అవార్డులు లభించాయి. తిరుపతికి రూ.2 కోట్ల ప్రోత్సాహకాన్ని కేంద్రం ప్రకటించింది.

Lakshmi Parvati : ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం : లక్ష్మీపార్వతి

విశాఖ, విజయవాడ, కడప కార్పొరేషన్లకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డులు దక్కాయి. పుంగనూరు, పిఠాపురంకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయి.