Balakrishna sensational comments : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలో నా అవతారం చూపిస్తా..నేనేంటో చూపిస్తాను’ అని చెప్పారు. ఆదివారం (ఫిబ్రవరి 7, 2021) నెల్లూరులో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ బోయపాటి సినిమా తర్వాత రోడ్లపైకి వస్తానని తెలిపారు.
ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాని చెప్పారు. రాష్ట్రం రావణకాష్టంలా మారింది…దర్మార్గ పాలన సాగుతోందన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే చెప్పారు. వైసీపీ చేస్తున్న దానికి వందరెట్లు ఎక్కువ చేసి చూపిస్తామని చెప్పారు.