Boat Accident
boat capsized : తూర్పుగోదావరి జిల్లా సీలేరు నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతవ్వగా.. ఆరుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని గ్రామస్తులు మంగంపాడు ఆస్పత్రికి తరలించారు. గల్లంతు అయిన వారిని బట్టి లక్ష్మయ్య, నేని లింగారెడ్డిగా గుర్తించారు.
వైరామవరం మండలం బొడ్డగండి పంచాయతీ తెలుగు క్యాంపు నుంచి సీలేరు నది మీదుగా గిల్లామడుగు గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.