×
Ad

Palnadu : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్య.. కత్తులతో నరికి చంపిన బంధువులు

కోడలు మాధురితోపాటు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

  • Published On : November 23, 2023 / 08:15 AM IST

Three killed

Three Killed In Palnadu : పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య గావించబడ్డారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురిని సమీప బంధువులు దారుణంగా హత్య చేశారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన అనంత సాంబశివరావు(50), అది లక్ష్మి(47), నరేష్(30)లను సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. కోడలు మాధురితోపాటు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

AP Crime: దెందులూరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఆత్మహత్య కేసులో భార్య, అత్తమామలు అరెస్ట్

ఈ సంఘటనపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.