Viral Video: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలో లింగాపురం గ్రామానికి చెందిన చిన్నారుల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల బాగా వైరల్ అయింది. చిన్నారులు వరహానదిలో దిగి.. దండాలు పెడుతూ తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు అందులో ఉంది. గ్రామంలో ఐదో తరగతి వరకే బడి ఉండడంతో రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు చెప్పారు.
ఈ వీడియో జాతీయ మీడియా వెబ్ సైట్లలోనూ కనపడింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ సిబ్బంది వివరణ ఇస్తూ అది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా తీసిన వీడియో అని చెప్పారు. నిజానికి ఆ ప్రాంతంలో రోడ్లు బాగానే ఉన్నాయని తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియోను సీఎంవో పోస్ట్ చేసింది.
‘‘రోడ్లు వేయాలని చిన్నారులు నీళ్లలోకి దిగి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఉన్న వీడియోపై విచారణకు సీఎంవో సంబంధిత కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపారు. చిన్నారులను నీటిలోకి దింపి ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగానే తీశారని తేలింది. అక్కడి రోడ్లకు సంబంధించిన నిజమైన వీడియోను మేము అందిస్తున్నాం’’ అని సీఎంవో ట్వీట్ చేసింది.
The Chief Minister’s Office has issued orders to District Collector to this effect.
In the inquiry it was found, the video was purposefully taken placing children in the water which is going viral.
The following video gives the actual view of the situation. 3/3 pic.twitter.com/kacVk7cMZY— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 20, 2022