Kanthi Rana Tata : వంగవీటి రాధా హత్యకు రెక్కీ..! చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలన్న సీపీ

ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ పై అసత్యాలు మాట్లాడారని సీపీ అన్నారు. రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ప్రాధమిక ఆధారం లేదన్నారు.

Kanthi Rana Tata

Kanthi Rana Tata : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశంపై విజయవాడ సీపీ కాంతి రానా టాటా మరోసారి స్పందించారు. రాధాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని సీపీ చెప్పారు. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నామన్నారు. పోలీసు అధికారులు రాధాతో మాట్లాడడం జరిగిందన్నారు.

ఎలాంటి అఫెన్స్ జరగనపుడు, క్రిమినల్ యాక్టివిటీ లేనపుడు కేసు ఎలా పెడతాం? అని సీపీ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ పై అసత్యాలు మాట్లాడారని సీపీ అన్నారు. రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ప్రాధమిక ఆధారం లేదన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని సీపీ రానా చెప్పారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటనపై ఎలాంటి అవాస్తవాలు ప్రసారం చేయొద్దని ఆయన కోరారు. హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సీపీ కాంతి రానా టాటా మరోసారి తేల్చి చెప్పారు.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

తన హత్యకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధా ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల రాధా ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ పరంగా అండంగా ఉంటామని ధైర్యం చెప్పారు చంద్రబాబు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.

తన హత్యకు రెక్కీ జరిగిందని రాధా చెప్పి ఏడు రోజులు అవుతుందని.. పోలీసులు ఇంత వరకు ఏ చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని చంద్రబాబు అన్నారు. ఈ విషయంపై తాను డీజీపీకి కూడా లేఖ రాశానన్న చంద్రబాబు.. ఎవరు రెక్కీ చేశారో, ఎందుకు చేశారో త్వరగా కనిపెట్టాలన్నారు. కెమెరాల ఆధారంగా దోషులు ఎవరో పట్టుకునే అవకాశం ఉన్నా, ఆలస్యం ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదన్నారు. గన్ మెన్లను ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే పోలీసులు మీద విశ్వాసం కలుగుతుందా అని చంద్రబాబు ఫైరయ్యారు. వంగవీటి రాధా హత్యకు కుట్రపన్నిన వారిపై.. చర్యలు తీసుకోవాలని ఇటీవల డీజీపీకి కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

ఈ నెల 26న గుడివాడలో నిర్వహించిన వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో పాల్గొన్న వంగవీటి రాధా.. తన హత్యకు కొందరు కుట్ర పన్నారని, రెక్కీ కూడా నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో రాధా చేసిన కామెంట్స్‌ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వంగవీటి రాధాకు భద్రత కల్పించింది. ఇందులో భాగంగా 2+2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే గన్ మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. అభిమానులే తనకు రక్షణ అని చెప్పారు. మరోవైపు వంగవీటి రాధా ఇంటి సమీపంలోనే ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఉన్న స్కూటీని ఆయన అనుచరులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Covid Restrictions : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు మూసివేత..

2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధా మంచి స్నేహితులు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా వీరి మధ్య స్నేహం కొనసాగింది. డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.