Fathima Case
Fathima Case : విజయవాడ యువతి ఫాతిమాను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు ఉత్తరప్రదేశ్ బయలుదేరారు. ఫాతిమా హంతకులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు యూపీ బయలుదేరలేదంటూ టెన్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. టెన్ టీవీ వరుస కథనాలతో బెజవాడ పోలీసు యంత్రాంగం యాక్షన్ చేపట్టింది. విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు ఏసీపీ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ ఏర్పాటు చేసి యూపీలోని సహరన్ పూర్ కి పంపారు. ఫాతిమా హత్య కేసుకి సంబంధించి యూపీ పోలీసులతో మాట్లాడుతున్నామని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు. తప్పకుండా న్యాయం చేస్తామని ఫాతిమా కుటుంబసభ్యులకు సీపీ భరోసా ఇచ్చారు.
కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన విజయవాడ యువతి శవమై తేలింది. ప్రేమ పేరిట నమ్మించి తనతో పాటు తీసుకెళ్లిన యువకుడి చేతిలో హత్యకు గురైంది. స్థానిక చిట్టినగర్కు చెందిన ఫాతిమా(21) ఈ నెల 10 నుంచి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కొత్తపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. తన కూతురి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు.
కాగా ఫాతిమాకు మతిస్థిమితం లేకపోవడంతో చికిత్స కోసం ఆమె తండ్రి.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన వాసిఫ్ను పిలిపించారు. అతడు ఫాతిమాకు భూతవైద్యం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్యం పేరుతో మరో స్నేహితుడు తయ్యబ్ సాయంతో వాసిఫ్ ఫాతిమాను ట్రాప్ చేశాడు. ఢిల్లీకి ఆమెకు టికెట్ తీయించగా.. ఫాతిమా ఒంటరిగానే అక్కడికి రైలు ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వాసిఫ్, తయ్యబ్, ఫాతిమా ముగ్గురూ కలిసి యూపీలోని సహరన్పూర్కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే… ఈనెల 10వ తేదీన ఫాతిమా కనిపించకపోవడంతో, అదే రోజు ఆమె తండ్రి కొత్తపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు… తన కుమార్తె ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్కు వెళ్లిందని తెలుసుకున్న ఫాతిమా తండ్రి.. తన స్నేహితులతో కలిసి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. అతడి ఆచూకీ కనుగొని.. స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా తానే యువతిని హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమెకు సంబంధించిన బంగారం కూడా తన దగ్గరే ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఫాతిమా హత్యకు గురైందన్న చేదు నిజం తెలియడంతో… అత్యాచారం చేసి చంపేశారా అన్న కోణంలో సహారన్ పూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువతికి సంబంధించిన 15 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.