వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌ కుటుంబ వ్యవహారంలో మ‌రో ట్విస్ట్ ..

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Duvvada Srinivas

Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి, కుమార్తె హైందవి, వారి బంధువులుపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఎస్ఎఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న తన ఇంటిపై వారు దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నంకు పాల్పడ్డారని దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను దువ్వాడ కోరారు. తనపై దాడికి పాల్పడిన వాణి, హైందవి, వారి బంధువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు