Sanjeev Kumar
Sanjeev Kumar : న్యాయవ్యవస్థపై కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో బీసీలు ఆరు నుంచి ఏడు శాతం వరకే ఉన్నారని చెప్పారు. బీసీలు తక్కువగా ఉండటం వల్లే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సంజీవ్ కుమార్ ఆరోపించారు. న్యాయవ్యవస్థలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయస్థానంలో కూర్చున్నంత మాత్రాన వారు దేవుళ్లు అయిపోరని అన్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
బీసీలకు అన్యాయం జరుగుతోంది అంటూ న్యాయవ్యవస్థ గురించి వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి.