ఆకస్మాత్తుగా సీఎం జగన్ హస్తినా టూర్!

  • Publish Date - September 21, 2020 / 09:24 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు.

రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు.



ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం 3 గంటలకు జగన్ ఢిల్లీకి బయల్దేరుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్‌ జగన్ కలిసే అవకాశం ఉంది.

మంగళవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది.



ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ నిధులు, కొవిడ్‌ తదితర అంశాలపై సీఎం జగన్ కేంద్ర మంత్రులతో సమావేశంలో వివరించే అవకాశం ఉంది.

పోలవరం, నరేగా పెండింగ్‌ నిధుల విడుదలపై ఆయన కేంద్రంతో చర్చించనున్నారు.



మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ అఫిడవిట్లు దాఖలుపై ఆయన చర్చించే అవకాశమందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు