అజ్ఞాతం వీడనున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని షరతులు విధించింది.
- Naveen
- Published On : May 28, 2024 / 10:53 PM IST
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడనున్నారు. హైకోర్టు ఆదేశాలతో నరసరావుపేట ఎస్పీని కలవనున్నారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి మూడు కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని షరతులు విధించింది. పూర్తి వివరాలు అందించేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నారు పిన్నెల్లి.
Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
