PF Withdrawals : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ PF డబ్బులను రూ. 5లక్షల వరకు విత్‌డ్రా చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

PF Withdrawals : పీఎఫ్ ఆటోమేటిక్ సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నుంచి ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉంది.

PF Withdrawals

PF Withdrawals : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (PF) విత్‌‌డ్రా ఆటోమేటిక్ సెటిల్మెంట్ లిమిట్ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను ఆలస్యం లేకుండా సులభంగా పొందవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన 7.5 కోట్ల మంది సభ్యులకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ల (ASC) పరిమితిని పెంచాలని నిర్ణయించింది.

Read Also : AC Blast : వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి.. అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. మీ AC సేఫ్టీ కోసం ఇలా చేయండి..!

గత వారమే శ్రీనగర్‌లో జరిగిన EPFO ​ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నుంచి తుది ఆమోదం పొందాల్సి ఉంది.

కొత్త మార్పు ఏంటి? :
ఇప్పుడు PF అడ్వాన్స్ క్లెయిమ్ (ASAC) పరిమితి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. అంటే.. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇప్పుడు 3 నుంచి 4 రోజుల్లో జరుగుతుంది. గతంలో 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు, వివాహం, విద్య, ఇల్లు కొనడానికి కూడా ఆటో-క్లెయిమ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే, గతంలో ఆటో-క్లెయిమ్ అనారోగ్యం, ఆస్పత్రి ఖర్చులకు మాత్రమే అందుబాటులో ఉండేది.

EPFO ఖాతాదారులకు ప్రయోజనాలివే :
ఈపీఎఫ్ఓ ప్రకారం.. 95 శాతం క్లెయిమ్‌లు ఇప్పుడు ఆటో-ప్రాసెస్ అవుతాయి. కోట్లాది మంది ఉద్యోగులకు వెంటనే పీఎఫ్ డబ్బు చేతికి అందుతుంది. పేపర్ వర్క్ ఉండదు. గతంలో 27 దశల్లో ఉండేవి. కానీ, ఇప్పుడు 18 మాత్రమే ఉన్నాయి. త్వరలో 6 దశలు మాత్రమే మిగిలి ఉంటాయి. అతి త్వరలో PF డబ్బులను UPI, ATM ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రకారం.. ఈ సదుపాయాన్ని మే-జూన్ నాటికి అమలు చేయవచ్చు.

ఈ బెనిఫిట్ ఎప్పుడు లభిస్తుందంటే? :
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నుంచి ఆమోదం పొందిన వెంటనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్‌ను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. గత వారమే కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖ NPCI సిఫార్సును ఆమోదించిందన్నారు.

Read Also : Ration Card eKYC : మీకు రేషన్ కార్డ్ ఉందా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో e-KYC ఎలా పూర్తి చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ఈ ఏడాది మే చివరి లేదా జూన్ నాటికి సభ్యులు యూపీఐ, ఏటీఎం ద్వారా PF డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చునని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) లేదా బ్యాంకుల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి ఇతర పథకాల సభ్యులకు కూడా ప్రయోజనాలు పొందవచ్చు.