Gold Rate Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయిన వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గతవారం వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు.. ఈ వారం మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ (గురువారం) కూడా భారీగా పెరిగింది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1700 పెరిగింది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 880 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై 49డాలర్లు పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 3,373 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలాఉంటే.. వెండి ధర స్వల్పంగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.91,000కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,280కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,430కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 91,000 కాగా.. 24క్యారెట్ల ధర రూ.99,280కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,18,900 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,900 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,18,900 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.