Gold Rate : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర .. రూ.75వేల మార్క్ దిశగా పసిడి ధర పరుగులు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold and Silver Price

Gold Rate in Hyderabad : బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. శనివారం ఉదయం పసిడి ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.1200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 1,048 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర రూ. 71వేల మార్క్ దాటి దూసుకెళ్తోంది. బంగారం ధర పెరుగుదల ఇదేతరహాలో కొనసాగితే.. ఈ నెలాఖరుకు తులం బంగారం ధర రూ. 75వేలను దాటిపోయే అవకాశాలున్నాయి. మరోవైపు వెండిధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరగడంతో.. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కిలో వెండి రూ. 87వేలకు చేరింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,350 మార్క్ కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,290 జీవనకాల గరిష్టాలను తాకింది.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,440.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 65,350 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,290.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,150 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,160కు చేరింది.

 

  • భారీగా పెరిగిన వెండి ధర ..
    దేశం వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.87,000 మార్క్ కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నై, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ. 87,000. ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.83,350 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 82,000 మార్క్ కు చేరింది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.