Gold Price: 5 రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

దేశంలో వెండి ధరల్లో రూ.1,000 పెరుగుదల కనపడింది.

Gold Price: 5 రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Updated On : March 26, 2025 / 11:09 AM IST

బంగారం ధరలు ఐదు రోజుల తర్వాత మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం 10 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.100 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర రూ.1,000 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు 10 గ్రాములకు రూ.100 పెరిగాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.81,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,400గా ఉంది.

Gold

Gold

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో బంగారం ధర రూ.100 పెరిగి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,550గా ఉంది
  • ముంబైలో ఇవాళ ఉదయం 10 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.81,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,400గా ఉంది

వెండి ధరలు

దేశంలో వెండి ధరల్లో రూ.1000 పెరుగుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.1,02,000గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.1,02,000గా ఉంది