Mukesh Ambani, Gautam Adani
ఫోర్బ్స్ ఇండియన్ బిలియనీర్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ రెండో స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీ ఆస్తుల నికర విలువ రూ.9,68,020 కోట్లు. 2023లో కంటే ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ 39.76 శాతం పెరిగింది.
అలాగే, ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ ఇండియన్ బిలియనీర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన గౌతం అదానీ ఆస్తుల నికర విలువ రూ.7,00,980 కోట్లు. వరల్డ్ బిలియనీర్ల జాబితాలో 200 మంది భారతీయులు చోటు సంపాదించుకున్నారు. గత ఏడాది ఈ జాబితాలో 169 మంది భారతీయులు ఉండేవారు.
భారత్లో టాప్-10 బిలియనీర్లు
కాగా, ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ జాబితాలో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ సహా ఆయన కుటుంబం రూ.19.43 లక్షల కోట్ల సంపదతో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎలిసన్ ఉన్నారు.
Also Read: వామ్మో.. తెలుగు రాష్ట్రాల్లో జియో యూజర్లు ఎంతగా పెరిగారో తెలుసా?