PM Surya Ghar Yojana
PM Surya Ghar Yojana : మీ ఇంటికప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటారా? అయితే, మీకోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది. 2024లో ఫిబ్రవరి 13న కేంద్రం పీఎం సూర్యా ఘర్ ముఫ్త్ బిజిలి అనే పేరుతో ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
అప్పటినుంచి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. ఈ పథకం ప్రారంభమైన ఏడాది నుంచి 10.09 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసినట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
అయితే, ఈ ఉచిత విద్యుత్ పథకానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా చందాదారుల సంఖ్య పెరుగుతోంది. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్తును ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ కూడా అందిస్తోంది.
ఈ పథకం కింద విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు. అక్టోబర్ నాటికి 20 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2027 నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా అందించాలని యోచిస్తోంది.
అసలు ఈ పథకం ఏంటి?
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేందుకు 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా, 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలతో సహా ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తోంది.
పథకం ప్రయోజనాలివే :
ప్రధాన బ్యాంకులు అందించే రుణ పథకం ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు అర్హులంటే? :
ఎలా దరఖాస్తు చేయాలి? :