Xiaomi NoteBook Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి రెండు కొత్త ప్రొడక్టులు రానున్నాయి. ఆగస్టు 30న భారత మార్కెట్లో షావోమీ నోట్ బుక్ ప్రో (Xiaomi NoteBook Pro) ల్యాప్టాప్, 4K స్మార్ట్ టీవీ X సిరీస్ (4K Smart TV X Series) లాంచ్ కానున్నాయి. ఈ మేరకు చైనా దిగ్గజం షావోమీ అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ మైక్రోసైట్ లైవ్లోనే ఉండగా.. Xiaomi ల్యాప్టాప్కు సంబంధించి ఎలాంటి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అదనంగా, Xiaomi స్మార్ట్ TV X సిరీస్ను మైక్రోసైట్ నుంచి లైవ్ చేసింది. షావోమీ అందించే స్మార్ట్ TV సిరీస్ అదే రోజున లాంచ్ అవుతుందని పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీని కొత్త రిజల్యూషన్ “4K” అనే ట్యాగ్లైన్తో చూడవచ్చు.
Xiaomi నుంచి రాబోయే నోట్బుక్ ప్రో 120G కోసం మైక్రోసైట్ లైవ్ చేసింది. కంపెనీ ల్యాప్టాప్ను ఆగస్టు 30న భారత మార్కెట్లో లాంచ్ చేస్తుందని మైక్రోసైట్ వెల్లడించింది. ల్యాప్టాప్ను మైక్రోసైట్లో “Fast” అనే ట్యాగ్లైన్తో చూడవచ్చు. రాబోయే Xiaomi ల్యాప్టాప్ స్పెసిఫికేషన్లను చైనా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రాబోయే Xiaomi స్మార్ట్ TV X సిరీస్ టీవీకి సంబంధించిన ఎలాంటి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. Xiaomi స్మార్ట్ TV 5A Pro భారత మార్కెట్లో లాంచ్ కానున్నట్టు తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ Android TV 11-ఆధారిత ప్యాచ్వాల్ 4పై రన్ అవుతుంది.
HD-ready (768×1,366 పిక్సెల్) రిజల్యూషన్, 178-డిగ్రీ వ్యూ యాంగిల్, 60Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 85 శాతం NTSC కలర్ gamut, 85 శాతం DCI-P3 కలర్ గామట్ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Xiaomi Smart TV 5A Pro 32-అంగుళాలలో రెండు HDMI 2.0, రెండు USB పోర్ట్లు, ఒక AVI ఇన్పుట్, 3.5mm హెడ్ఫోన్ జాక్, ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి. డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్, బ్లూటూత్ v5.0 కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ టీవీ 24W కంబైన్డ్ ఆడియో అవుట్పుట్తో డ్యూయల్ స్పీకర్ సెటప్ను కలిగి ఉంది. డాల్బీ ఆడియో, DTS వర్చువల్-X సపోర్టును కూడా కలిగి ఉంది.