Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన..దళితుడికి మలం పూసి…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దళితుడిని మరోసారి అవమానించిన ఘటన సంచలనం రేపింది. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవక ముందే మరో దళితుడిపై మలాన్ని పూసి అవమానించిన ఘటన వెలుుగచూసింది....

Madhya Pradesh police

Another Madhya Pradesh SHOCKER : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దళితుడిని మరోసారి అవమానించిన ఘటన సంచలనం రేపింది. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవక ముందే మరో దళితుడిపై మలాన్ని పూసి అవమానించిన ఘటన వెలుుగచూసింది. ఛతర్ పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో డ్రెయిన్ నిర్మాణపనులు చేస్తుండగా మరో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన రాంకృపాల్ పటేల్ కు పొరపాటున గ్రీజు తగిలింది. దీంతో రాంకృపాల్ పటేల్ ఆగ్రహం చెంది దళితుడి శరీరం, తల, ముఖంపై మానవ మలాన్ని పూసి తీవ్రంగా అవమానపర్చాడు. (Dalit Mans Face Smeared With Human Excreta)

Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..17మంది మృతి, 35మందికి గాయాలు

దీంతో ఎస్సీ, ఎస్టీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుడైన రాంకృపాల్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నామని మధ్యప్రదేశ్ పోలీసులు చెప్పారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో కుల ఆధారిత వివక్ష, హింస గురించి ఆందోళనలకు దారితీసింది. శుక్రవారం జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు దశరథ్ అహిర్వార్ శనివారం పోలీసులను ఆశ్రయించాడు.

Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్…ఢిల్లీలో హైఅలర్ట్

బికౌరా గ్రామంలో డ్రెయిన్ నిర్మాణ పనులు చేస్తుండగా పక్కనే ఉన్న చేతిపంపు వద్ద స్నానం చేస్తున్న నిందితుడు రాంకృపాల్ పటేల్ కు నిర్మాణ పనులకు వాడుతున్న గ్రీజు పొరపాటున తగిలిందని బాధితుడు దశరథ్ తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన రాంకృపాల్ పటల్ తాను స్నానం చేసే చెంబుతో మలాన్ని తీసుకువచ్చి తన తల, ముఖం, శరీరంపై పూసాడని బాధితుడు దశరథ్ చెప్పారు.

Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద

తనకు మలం పూయడంతోపాటు కులంపేరుతో దుర్భాషలాడాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను దీనిపై స్థానిక పెద్దలను పంచాయతీ చేయమని కోరగా వారు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా తనకు రూ.600 జరిమానా విధించారని దశరథ్ ఆవేదనగా చెప్పారు. ఈ దారుణ ఘటనపై తాము నిందితుడు రాంకృపాల్ పటేల్ పై ఐపీసీ సెక్షన్ 294, 506, ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టులపై కేసు నమోదు చేశామని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మన్మోహన్ సింగ్ బఘెల్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు