కరోనావైరస్ రోగిని ఒక మగ నర్సు అత్యాచారం చేసిన ఘటన భోపాల్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆమె మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరిన 43 ఏళ్ల మహిళ ఈ సంఘటనపై ఫిర్యాదు చేసిందని, నిందితుడిని వైద్యుడి ప్రకటన ద్వారా గుర్తించిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్కు తరలించారు. అదే రోజు సాయంత్రం ఆమె మరణించింది.
నిషాత్పురా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయగా, నిందితుడిని 40 ఏళ్ల సంతోష్ అహిర్వార్గా గుర్తించారు. విచారణ కోసం అతన్ని భోపాల్ సెంట్రల్ జైలులో ఉంచారు. నిందితుడు 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు మద్యం సేవించినందుకు సస్పెండ్ అయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా మరణించిన మహిళ 1984 భోపాల్ గ్యాస్ విషాదంలో ప్రాణాలతో బయటపడ్డారు.