Hyderabad: వంట విషయంలో ఇద్దరు రూమ్మేట్స్ మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఈ నెల 16, ఆదివారం హైదరాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ సహాని, రణ్ విజయ్ సింగ్ ఇద్దరూ హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు.
Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన
ఈ క్రమంలో గత ఆదివారం సాయత్రం వంట చేసే విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం తలెత్తింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రణ్ విజయ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని స్థానికులతో కలిసి రాజ్ కుమార్ సహానియే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తను దాడి చేసి వ్యక్తి మరణించడంతో ఖంగుతిన్న రాజ్ కుమార్ సహాని అక్కడ్నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా, అసలు విషయం తెలిసింది. అప్పటికే నిందితుడు పారిపోయి ఉండటంతో పోలీసులు అతడి కోసం గాలించారు. రాజ్ కుమార్ ఉత్తర ప్రదేశ్ వెళ్లేందుకు ప్రయత్నించాడు.
తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని, రైలులో వెళ్తున్నాడు. మధ్యలో నాగ్పూర్ సమీపంలో ఫోన్ స్విచ్ఛాన్ చేశాడు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ పోలీసులు అతడి కోసం గాలించారు. అతడు ప్రయాణిస్తున్న రైలును గుర్తించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఫొటో, ఇతర వివరాలు స్థానిక పోలీసులకు పంపారు. దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నిందితుడిని అక్కడి పోలీసులు నాగ్పూర్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు.