MLA Wife Suicide : మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుర్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ మంగేష్ కుందాల్కర్ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు.
ముంబైలోని సబర్బన్ కుర్లా ఈస్ట్లోని నెహ్రూ నగర్ ప్రాంతంలోని డిగ్నిటీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని తన నివాసంలో రాత్రి గం.8-30 సమయంలో ఆమె ఉరి వేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నెహ్రూ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : India Corona: భారత్లో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 90శాతం పెరుగుదల.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..