one dead,one injured due to cell phone tower collapse : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఒక సెల్ ఫోన్ టవర్ విరిగిపడిన ఘటనలోఒక వ్యక్తి మరణించాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. నగరంలో సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి.
తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఆ గాలి ధాటికి విరిగి కే.ఎన్ రోడ్డులో అడ్డంగా పడిపోయింది. ఆసమయంలో బైక్ పై అటుగా వెళుతున్న బొడ్డు రాజేష్(43) రాణి అనే ప్రవేట్ హాస్పటల్ నర్సుపై సెల్ టవర్ పడింది.
దీంతో రాజేష్ అక్కడికక్కడే మరణించగా… రాణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.