×
Ad

Road Accident : కాలువలోకి దూసుకెళ్ళిన కారు.. ఇద్దరు మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు తెల్లవారు ఝమున విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు వద్ద కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు.

  • Published On : September 21, 2021 / 08:59 AM IST

Car Accident

Road Accident : పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు తెల్లవారు ఝమున విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు వద్ద కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు. నిడమర్రు మండలం, మందలపర్రు వద్ద తెల్లవారుఝుమున ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. కారుతో ప్రయాణిస్తున్న ఇద్దుర వ్యక్తులు అక్కడి కక్కడే ఊపిరాడక మరణించారు. మరిణించిన వారిని సుమంత్(35) శరత్ గా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.