సార్..నాకు ప్రాణహాని ఉంది..మరో జైలుకు మార్చండి.. అంటూ దవీందర్ సింగ్ కోరుతున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోట్బాల్ వాల్ జైలులో ఉన్నారు. అయితే..ఈ జైలులో పలువురు ఉగ్రవాదులున్నారని, మరో జైలుకు మార్చాలని జమ్మూలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టును ఆయన అభ్యర్థించారు. తనను ఇక్కడి నుంచి హీరానగర్ జైలుకు పంపించాలని అభ్యర్థించారు. దవీందర్ చేసిన అభ్యర్థనను కోర్టు అనుమతించింది.
పది రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసుల అదుపులో రవీందర్ ఉన్నారు. పూర్తిగా దర్యాప్తు చేసేందుకు 15 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దవీందర్ను రిమాండ్కు పంపింది.
కరుడుగట్టిన హిజబ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణీస్తూ..జనవరి 11వ తేదీన దవీందర్ సింగ్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించినందుకుగాను..పోలీసులు దవీందర్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న దవీందర్ సింగ్ గతంలో రాష్ట్రపతి మెడల్ అందుకున్నారు.
వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్న ఉగ్రవాదులను లోయలోకి భద్రంగా చేర్చుతోన్న దవీందర్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ని మాటు వేసి మరీ పట్టుకున్నారు. దవీందర్ సింగ్కి ఈ టెర్రరిస్టులతో ఏం పని.. వారితో ఇతని సంబంధాలు ఏ స్థాయి వరకూ చేరాయి.. ఉగ్రవాదులకు కేవలం దవీందర్ సింగ్ కొరియర్గా మాత్రమే పని చేస్తున్నాడా లేక వారి మోచేతి నీళ్లు తాగుతూ ఇంకా దేశద్రోహం చేసే స్థాయి వరకూ వెళ్లాడా అనే విషయాలపై పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
ఇతను యాంటీ హైజాకింగ్ విభాగంలో పని చేస్తున్నారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆపరేషనల్ డ్యూటీస్ చేస్తున్నాడు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడన్న విషయం, దవీందర్ సింగ్ వ్యవహారశైలిపై కొన్నాళ్లుగా పోలీస్ శాఖకి డౌట్ వచ్చింది. అందుకే అతని వ్యవహారాలపై నిఘా పెట్టారు పోలీసులు. ఈజీగా తమ ట్రాప్లో పడేందుకు దవీందర్ సింగ్ కార్యకలాపాలు సాగేందుకు వీలుగా కొన్ని చోట్ల చెక్ పాయింట్స్ లూజ్ చేశారు. ఖాజీగండ్లోని మీర్ బజార్ వద్ద ఐటెన్ కారులో ఇద్దరు టెర్రరిస్టులను తరలిస్తూ దొరికిపోయాడు. అతను మాత్రం ఈ ఇద్దరు ఉగ్రవాదులను లొంగిపోయేందుకు ఒప్పించానంటూ మాటలు చెప్పాడు.
అందుకే వారితో కారులో ఉన్నట్లు దవీందర్ సింగ్ నమ్మబలుకుతున్నాడు. దవీందర్ సింగ్ తో పాటు దొరికిన ఇద్దరు టెర్రరిస్టులలో ఒకరు నవీద్ బాబు, మరొకరు రఫీ అహ్మద్. వీరిలో నవీద్ బాబు కూడా గతంలో పోలీస్ శాఖలో పని చేశాడు. బుద్గామ్లోని ఫుడ్ అండ్ సప్లయ్ సెక్యూరిటీ వింగ్లో 2017 వరకూ నవీద్ బాబు విధులు నిర్వహించాడు. తర్వాత మే 2017లో ఏకే 47 రైఫిల్తో పరారైన నవీద్ బాబు హిజ్బుల్ ముజాయిద్ధీన్ ఉగ్రవాదిగా మారిపోయాడు.
నవీద్ బాబు ఒక్కడే ఓ 30మంది టెర్రరిస్టుల గ్రూప్ని లీడ్ చేస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. కశ్మీర్ లోయలో కనీసం 12మంది పోలీసుల మరణాలకు ఈ ముఠానే కారణం. అంటే ఓ కరుడుగట్టిన ఉగ్రవాదుల ముఠాతో DSP దవీందర్ సింగ్ చేతులు కలిపినట్లు అర్ధమవుతోంది.