రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత, బ్రాంచీల రద్దుకు యాజమాన్యాల నుంచి వచ్చిన దరఖాస్తుల నేపథ్యంలో ఈసారి దాదాపు 10 వేల సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. 173 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 13 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 6 వేలకుపైగా సీట్లు తగ్గిపోతుండగా, ఉన్న కాలేజీల్లో మరో 4 వేల వరకు సీట్లు తగ్గనున్నాయి. ఇందుకోసం యాజమాన్యాలే స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నాయి. అందులో B-TECH లో 26 బ్రాంచీలు, M-TECH లో 66 బ్రాంచీలు, MBAలో ఐదు, B-Pharmacy, M-Pharmacy, తదితర కోర్సుల్లో 140 వరకు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి.
అందుకే కాలేజీల్లో చేరే సంఖ్యకు అనుగుణంగా కాకుండా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) తెలిపిన సీట్ల సంఖ్య ప్రకారమే ఫ్యాకల్టీని నియమించాలని గురువారం (ఫిబ్రవరి 7,2019) JNTUH నిర్ణయించింది. కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమిస్తామని చెబుతున్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చి చెప్పింది.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత పరంపర కొనసాగుతోంది. 2019-20 విద్యా సంవత్సరంలో మూసివేతకు దరఖాస్తు చేసిన కాలేజీలు.
– అల్ హబీబ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– అయాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యూటికల్ సైన్సెస్.
– కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్.
– నిశిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– పల్లవి వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– విద్యాభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
– పీఆర్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్.
– ధ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– షాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
– కేబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్.