2019 ఏప్రిల్లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ల కోసం జాతీయ స్థాయి మెరిట్ బేస్డ్ స్కాలర్ షిప్ (AISTE) పరీక్షలు నిర్వహించనున్నాయి.. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు 249 రూపాయలు. పరీక్ష విధాపం ఇంగ్లీష్, హిందీ, మరాఠీ లేదా సెమీ-ఇంగ్లీష్లో ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. అందులో గణితం -60, ఆంగ్ల -20, సైన్స్ -20 & జికె -20.
అర్హులు: 4వ తరగతి నుంచి ఇంటర్ మిడియట్ అభ్యర్ధుల వరకు అర్హలు.
* జాతీయ స్థాయి అవార్డులు:
– మొదటి ర్యాంక్ అభ్యర్థికి 90,000 రూపాయల విలువైన స్కాలర్ షిప్ లభిస్తుంది.
– 2వ ర్యాంక్ అభ్యర్థి 70,000 రూపాయల స్కాలర్ షిప్ లభిస్తుంది.
– 3వ ర్యాంక్ అభ్యర్థి 50,000 రూపాయల స్కాలర్ షిప్ లభిస్తుంది.
– 200 మంది ప్రతిభావంతులైన విద్యార్ధులు 5000 రూపాయల స్కాలర్ షిప్ లభిస్తుంది.
* రాష్ట్ర స్థాయి అవార్డులు:
– మొదటి ర్యాంక్ అభ్యర్థులకు ఒక సంవత్సరం పుస్తకాలు, సౌకర్యాలు, సర్టిఫికెట్ల తో పాటు రూ. 30,000 అందుజేస్తారు.
* దరఖాస్తు విధానం:
– ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఎంపిక విధానం:
– అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
* ముఖ్యమైన తేదీలు:
– ఎగ్జామ్ డేట్ : 12 మే, 2019.
– అడ్మిట్ కార్డు : 18 ఏప్రిల్, 2019.
– ఫలితాలు : 01 జూన్, 2019
– రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 15 ఏప్రిల్, 2019.