AP EAPCET 2025 Counselling started
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 (AP EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈఏపీసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఆన్లైన్ https://eapcet-sche.aptonline.in/EAPCET/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు జులై 16 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ధృవపత్రాల ఆన్లైన్ పరిశీలన: జులై 17 వరకు కొనసాగుతుంది.
వెబ్ ఆప్షన్ల నమోదు: అభ్యర్థులు జులై 13వ తేదీ నుంచి 18 వరకు చేసుకోవచ్చు
వెబ్ ఆప్షన్లలో మార్పు: జులై 19న ఏమైనా మార్పులు ఉంటె చేసుకోవచ్చు.
సీట్ల కేటాయింపు ఫలితాలు: మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను జులై 22న ప్రకటిస్తారు.
కళాశాలల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన అభ్యర్థులు జులై 23 నుంచి 26 లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్టింగ్ చేసుకొవాలి.
తరగతుల ప్రారంభం: ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
కౌన్సిలింగ్ ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.