AP ECET 2025 Counselling: ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ అప్డేట్.. ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
AP ECET 2025 Counselling: ఏపీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తవగా.. తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది.
- V Santhosh Kumar
- Published On : July 19, 2025 / 03:08 PM IST
AP ECET 2025 final phase registration process has begun.
ఏపీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తవగా.. తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://ecet-sche.aptonline.in లోకి వెళ్లి ఫీజు చెల్లించి, వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని ప్రకటన చేశారు అధికారులు.
ఏపీ ఈసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు:
- జూలై 18 నుంచి ఆన్లైన్లో ఫీజు చెల్లించుకోవచ్చు.
- జూలై 19తో ఈ గడువు పూర్తవుతుంది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జులై 18 నుంచే వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
- ఈ గడువు జూలై 20తో పూర్తవుతుంది.
- జూలై 21న వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
- జూలై 22న ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.
- సీట్లు పొందిన అభ్యర్థుల జూలై 23 నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
- దీని గడువు జూలై 25తో ముగుస్తుంది.
- జూలై 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఏపీ ఈసెట్ 2025లో అర్హత సాధించిన పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్య్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలను కల్పిస్తారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు రిజర్వేషన్లను కూడా ఆధారంగా చేసుకొని సీట్ల కేటాయింపు చేస్తారు.
