Ap Icet 2025 Counselling starts from today
ఏపీ ఐసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 10) నుంచి మొదలుకానుంది. ఈ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుంది. ఇక వెబ్ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ జూలై 13 నుంచి జూలై 16 వరకు కొనసాగుతుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఏపీ ఐసెట్ 2025 పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు అధికారులు. సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ కారణం వల్లనైనా రిపోర్టింగ్ చేసుకోకపోతే కేటాయించిన సీటు రద్దు అవుతుంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.