ఏపీ ఎంసెట్-2019 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ఎస్.సాయిబాబు విడుదల చేశారు.
అమరావతి : ఏపీ ఎంసెట్-2019 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ఎస్.సాయిబాబు విడుదల చేశారు. నోటిఫికేషన్ను ఫిభ్రవరి 20న విడుదల చేయనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న ప్రారంభం కానుంది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మార్చి 27. అపరాధ రుసుము రూ.500తో దరఖాస్తుకు ఏప్రిల్ 4, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9, రూ.5 వేలు అపరాధ రుసుముతో ఏప్రిల్ 14 చివరి గడువులుగా నిర్ణయించారు.