కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ)లో పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి బోర్డు పరీక్షలను ఒక ఏడాదిలో రెండుసార్లు రాసే ఛాన్స్ రానుంది. తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించి, రెండో దశ పరీక్షలను మేలో నిర్వహిస్తారు.
ఈ మేరకు సీబీఎస్ఈ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసింది. పబ్లిక్ నోటీస్ను కూడా సీబీఎస్ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. దీనిపై ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. వచ్చేనెల 9 వరకు ప్రజలు ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. అనంతరం దానికి సీబీఎస్ఈ ఆమోదం తెలుపుతుంది.