Job Mela: పది పాసైన వారికి బంపర్ ఆఫర్.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ లో జాబ్స్.. పూర్తి వివరాలు మీకోసం
Job Mela: హనుమకొండ జిల్లాలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనుంది. ఈమేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య అధికారిక ప్రకటన చేశారు.

Job fair under the auspices of Infosys Foundation in Hanumakonda district
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హనుమకొండ జిల్లాలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనుంది. ఈమేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య అధికారిక ప్రకటన చేశారు. ఈ జాబ్ మేళాలో భాగంగా హనుమకొండలోని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో టెలికాలర్స్, సీసీటీవీ మానిటరింగ్, హెచ్ఆర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, యుఎస్ఐటి రిక్రూటర్స్ వంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి, నిరుద్యోగులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్హతలు:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన వారై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుంచి 15 వేల వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
అవసరమయ్యే ధ్రువపత్రాలు:
అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, బయోడేటా, పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం 7893660741,7893398393 నెంబర్ ను సంప్రదించాలి.