Maha Kumbh 2025 : మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఛాయ్ వాలే బాబా’.. వాట్సాప్ ద్వారా అభ్యర్థులకు ఫ్రీగా ఐఏఎస్ కోచింగ్!

Maha Kumbh 2025 : ఈ మహాకుంభమేళా వేడుకల మధ్య "చాయ్ వాలే బాబా" ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు ఈయన టీ అమ్మేవాడు సన్యాసిగా మారారు.

Meet Chai Wale Baba

Maha Kumbh 2025 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానుంది. ఈ మహోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌కి 45 కోట్ల మంది భక్తులను వస్తారని అంచనా. ఇప్పటికే మహా కుంభమేళా ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈ మహాకుంభమేళా వేడుకల మధ్య “చాయ్ వాలే బాబా” ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు ఈయన టీ అమ్మకందారుడు కాగా ప్రస్తుతం సన్యాసిగా మారారు. సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు 40ఏళ్లుగా ఉచిత కోచింగ్ అందిస్తున్నారు.

Read Also : Mahakumbh 2025 : మహాకుంభమేళాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఛోటూ బాబా.. ఎత్తు 3 అడుగులే.. 32ఏళ్లుగా స్నానం చేయలేదట!

సాధారణంగా తమ కలలను నెరవేర్చుకోవడానికి లక్షలాది మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవుతారు. వారిలో కొంతమంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రతిష్టాత్మకమైన పోస్టులను పొందగలరు.

పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులకు మార్గదర్శకత్వం అవసరం. అందుకే చాలామంది టాప్ రేంజ్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోచింగ్ కోసం చేరుతుంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు.

సివిల్స్ రాసే అభ్యర్థులకు ఆశాకిరణంగా :
యూపీలోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ‘చాయ్ వాలా బాబా’ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆశాకిరణంగా నిలిచాడు. గత 40 ఏళ్లుగా సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా కోచింగ్ క్లాసులు ఇస్తున్నాడు. యూపీలోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన దినేష్ స్వరూప్ బ్రహ్మచారిని ‘చాయ్ వాలా బాబా’ అని పిలుస్తారు. ఆయన రోజుకు పది కప్పుల టీతో మాత్రమే జీవిస్తారు. ఎప్పుడూ మౌనంగా ఉంటూ ఆహారం మానుకోవాలని ప్రతిజ్ఞ తీసుకున్నారు. అలాగే, ఆయనకు చదువు పట్ల ప్రత్యేక విధానం అందరి దృష్టిని ఆకర్షించింది.

Maha Kumbh 2025 : Chai Wale Baba

వాట్సాప్ ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తూ :
ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ 2025కి హాజరవుతున్న ‘చాయ్ వాలా బాబా’ వాట్సాప్ ద్వారా విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ని అందజేస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న రాజేష్ సింగ్.. తనకు గత నాలుగు-ఐదేళ్లుగా బాబాతో అనుబంధం ఉందని, తనకు అవసరమైనప్పుడు, ఆయన మార్గనిర్దేశం చేసేవాడని చెప్పుకొచ్చాడు. “భాషకు ఒక మాధ్యమం కావాలి. అది రాయవచ్చు లేదా మౌఖికంగా ఉంటుంది. దాన్ని ఎవరూ అశాబ్దికమని పిలవరు. గురూజీ మౌనంగా ఉంటారు. కానీ, మేం ఆయన బాడీ లాంగ్వేజ్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అర్థం చేసుకున్నామని తెలిపారు.

యూపీఎస్సీ అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు :
యూపీఎస్సీ విద్యార్థులు తమ ప్రశ్నలను తనకు రాతపూర్వకంగా ఇస్తారని, వాటికి తాను కూడా రాతపూర్వకంగానే సమాధానాలు ఇస్తారని చెబుతున్నారు. “బాబా సివిల్ సర్వీసెస్ ఆశించేవారికి ఉచిత కోచింగ్ ఇస్తాడు. విద్యార్థులకు వాట్సాప్ ద్వారా నోట్స్ ఇస్తుంటాడు.

అంతేకాదు.. అభ్యర్థుల ప్రశ్నలకు కూడా సమాధానమిస్తాడు. విద్యార్థులకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని బాబా చెబుతుంటారు. ఆయన మౌనంగా ఉంటూనే అభ్యర్థులకు కోచింగ్ ఇస్తుంటాడని, ప్రపంచ సంక్షేమం కోసమే ఉచితంగా సర్వీసు అందిస్తుంటాడని చెబుతుంటారు.

Read Also : Realme GT 7 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి జీటీ 7ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఈ ఫోన్ కొనాలా వద్దా?