NIRF Ranking 2024 : సీబీఎస్ఈ ఫలితాలు వచ్చేశాయి. 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించి ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇప్పటికే చాలా బోర్డులు 12వ తరగతి ఫలితాలు ప్రకటించాయి. సీబీఎస్ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పై చదువుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కాలేజీల కోసం అన్వేషిస్తున్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం.. దేశంలోని టాప్ 20 కాలేజీలను జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో 74.81 స్కోర్తో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మిరాండా హౌస్ దేశంలోనే టాప్ ర్యాంకింగ్ కాలేజీగా నిలిచింది. ఇక, రెండో స్థానంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీ ఉండగా, చెన్నైకి చెందిన ప్రెసిడెన్సీ కాలేజీ మూడో స్థానంలో ఉంది. హిందూ కళాశాల 72.39 స్కోర్ను కలిగి ఉండగా, ప్రెసిడెన్సీ కళాశాల 72.39 సాధించింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024 ప్రకారం.. భారత్లో టాప్ 20 కాలేజీల జాబితా ఈ కింది విధంగా ఉన్నాయి.
2024కి సంబంధించి 10వ తరగతి పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ సోమవారం విడుదల చేయగా 93.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 94.75 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 2.04 శాతం పాయింట్లతో అధిగమించారు. 47వేల మంది విద్యార్థులు 95 శాతానికి మించి మార్కులు సాధించగా, 2 లక్షల మందికి పైగా 90 శాతానికి పైగా స్కోర్లు సాధించారు.