Notification released for 379 technical posts in Indian Army Short Commission
బీటెక్ కంప్లీట్ చేసినవారికి ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్ కమిషన్లోని 379 టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా ఆగస్టు 22తో గడువు ముగియనుంది. కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్ పూర్తి చేసిన వారై ఉండాలి. లేదా బీటెక్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 ఏళ్ళ నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ముఖ్యమైన గమనిక:
పెళ్లికాని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ట్రైనింగ్ సమయంలో రూ.56,100 స్టైఫెండ్ ఇస్తారు. లెఫ్టెనెంట్ హోదాతో పూర్తి విధుల్లోకి తీసుకున్న తరువాత ఏడాదికి రూ.18 లక్షల జీతం ఇస్తారు.