TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్ కౌన్సిలింగ్.. ఫైనల్ ఫేజ్ మొదలయ్యింది.. ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఫేజ్ లలో సీట్ల కేటాయింపు పూర్తి అవగా ఆగస్టు 5 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ కానుంది.
- V Santhosh Kumar
- Published On : August 5, 2025 / 03:08 PM IST
TG EAPSET 2025 final phase counselling has begun.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఫేజ్ లలో సీట్ల కేటాయింపు పూర్తి అవగా ఆగస్టు 5 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgeapcet.nic.in/ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
- ఆగస్ట్ 6వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన మొదలవుతుంది.
- ఆగస్ట్ 6 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు మొదలవుతాయి.
- ఆగస్ట్ 7వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది.
- ఆగస్ట్ 10లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.
- ఆగస్ట్ 10 నుంచి 12వ తేదీ వరకు ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
- ఆగస్ట్ 11 నుంచి 13వ తేదీ వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేసుకోవాలి.
- రిపోర్టింగ్ చేయకపోతే కేటాయించిన సీటు రద్దవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఉన్న మొత్తం సీట్లు 91,495. వాటిలో ఇప్పటివరకు 83,521 సీట్లు కేటాయించబడ్డాయి. అంటే దాదాపు 91.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
