Typhoon Saola: 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు బయటికి రావొద్దని చైనాలో ఆదేశాలు.. ఎందుకో తెలుసా?

హాంకాంగ్ స్టాక్ మార్కెట్ శుక్రవారం మూతపడింది. ఇది కాకుండా, సుమారు 460 విమానాలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రజలు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు

Typhoon Saola: 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు బయటికి రావొద్దని చైనాలో ఆదేశాలు.. ఎందుకో తెలుసా?

Updated On : September 2, 2023 / 7:13 PM IST

China: శనివారం తెల్లవారుజామున దక్షిణ చైనాలో ‘సోలా’ తుపాను బీభత్సం సృష్టించింది. హెచ్చరికల దృష్ట్యా, ఒక రోజు ముందు సుమారు తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది కాకుండా, తుఫాను కారణంగా హాంకాంగ్‌లోని చాలా ప్రాంతాలు, దక్షిణ చైనా తీర ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో వ్యాపార కార్యకలాపాలు, రవాణా సేవలు, పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఈ శక్తివంతమైన తుఫాను హాంకాంగ్‌కు దక్షిణంగా ఉన్న జుహై నగరాన్ని మధ్యాహ్నం 3.30 గంటలకు తాకినట్లు గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన వాతావరణ బ్యూరో తెలిపింది.

Laughing Buddha : ఎవరీ లాఫింగ్ బుద్ధా .? ఆయనకు ఎందుకా పేరు వచ్చిందో తెలుసా..?

ఇక ఈ తుఫాను నేపథ్యంలో 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు బయటికి రావొద్దని చైనాలో ఆదేశాలు జారీ చేసింది. కారణం తుఫాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గ్వాంగ్‌డాంగ్ తీరం వెంబడి నైరుతి దిశలో కదులుతుంది. అంతకంటే తక్కువ బరువు ఉన్నవారు బయటికి వస్తే.. బలమైన ఆ గాలులకు కొట్టుకుపోతారని ప్రభుత్వం అలాంటి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అయితే సోలా తుఫాన్ ప్రస్తుతం బలహీనపడటం ప్రారంభించిందట. హెచ్చరికను అనుసరించి, శుక్రవారం 7,80,000 మందిని గ్వాంగ్‌డాంగ్‌లోని హైరిస్క్ ప్రాంతాల నుంచి తరలించారు. మరో 1,00,000 మందిని పొరుగున ఉన్న ఫుజియాన్ ప్రావిన్స్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది శ్రామిక ప్రజలు ఇంట్లోనే ఉన్నారు. వివిధ నగరాల్లోని పాఠశాలలు వచ్చే వారం వరకు మూసివేశారు.

Maratha Reservation: మళ్లీ మొదలైన మరాఠా రిజర్వేషన్ పోరు.. జల్నాలో తీవ్ర ఘర్షణ, 42 మంది పోలీసులకు గాయాలు

ఇక ఈ తుఫాన్ కారణంగా.. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ శుక్రవారం మూతపడింది. ఇది కాకుండా, సుమారు 460 విమానాలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రజలు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు వచ్చే రైళ్ల నిర్వహణను రైల్వే అధికారులు నిలిపివేసినట్లు ‘సీసీటీవీ’ న్యూస్ ఛానల్ తన వార్తల్లో పేర్కొంది.