Ashraf Ghani: అప్ఘాన్ గడ్డపై రక్తపాతం వద్దనే వెళ్లిపోయాను.. దేశాధ్యక్షుడి ప్రకటన

అప్ఘానిస్తాన్ గడ్డపై రక్తపాతాన్ని అడ్డుకునేందుకు తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ వెల్లడించారు.

Left To Avoid Bloodshed, Ashraf Ghani Writes On Social Media After Leaving Afghanistan

Ashraf Ghani leaving Afghanistan : అప్ఘానిస్తాన్ గడ్డపై రక్తపాతాన్ని అడ్డుకునేందుకు తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ వెల్లడించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రతిఘటించి ఉంటే రక్తపాతానికి దారితీసేదని అన్నారు. అందుకే దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టలేక తాను దేశం విడిచి వెళ్లినట్టు ఘనీ తన ఫేస్ బుక్ అకౌంట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడితే అనేక మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చేదని అన్నారు. అప్ఘాన్ తాలిబన్ల చేతుల్లో పెట్టి ఇక దేశ రక్షణ మీ బాధ్యతనేంటూ పరోక్షంగా పరాజయాన్ని అంగీకరించారు. ఆదివారం అప్ఘాన్ పూర్తిగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ల దెబ్బకు ఘనీ పలాయనం చిత్తగించారు.

ఫేస్‌బుక్ సందేశంలో.. 
దేశ ప్రజలారా.. ఈరోజు నేను ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 20 ఏళ్లుగా రక్షించి నా దేశాన్ని వీడడం చాలా విచారకరం. అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సాయుధ తాలిబన్లు దూసుకొస్తున్నాయి. నా ముందు రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తాలిబన్లతో పోరాడి దేశకోసం ప్రజలంతా ప్రాణాలు త్యాగం చేయడం.. కాబూల్ నగరం విధ్వంసం అవ్వడం.. ఈ రెండు పరిణామాలు జరగడం నాకు ఇష్టం లేదు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేను. అందుకే దేశాన్ని తాలిబన్లకు అప్పగించి నేను అధ్యక్షుడిగా తప్పుకుంటున్నాను. తాలిబన్లు కూడా నన్ను దించేయాలని నిర్ణయించుకున్నారు. కాబుల్ సిటీని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఈ రక్తపాతాన్ని నివారించడానికి నాకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించలేదు. అందుకే దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాను అంటూ ఫేస్ బుక్ లో ఘనీ రాసుకొచ్చారు. అధ్యక్షుడు ఘనీ దేశాన్ని వీడటంతో తాలిబన్లు అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో తాలిబన్ల విజయం అనివార్యమైంది.
Afghanistan: అప్ఘాన్ క్రికెట‌ర్లు ఐపీఎల్‌లో ఆడ‌తారా? వారి భవిష్యత్తు ఏంటి?

తాలిబన్లదే బాధ్యత :
దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని సంపదను కాపాడాల్సిన బాధ్యత తాలిబన్లదేనంటూ ఘనీ ఆకాంక్షించారు. అప్ఘానిస్తాన్ పరువు ప్రతిష్ఠలను కాపాడతారా? లేదా అసాంఘిక శక్తులకు ఆశ్రయమిస్తారా? తెలియక అక్కడి ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. తమ భవిష్యత్తుపై భరోసా లేక ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. అప్ఘాన్ ప్రజలతో పాటు వివిధ దేశాలకు తాలిబన్లు హామీ ఇవ్వాల్సి ఉంది.  దేశ ప్రజల హృదయాలను చట్టబద్ధంగా గెల్చుకోవాలి. అప్ఘానిస్తాన్ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ అష్రాఫ్ ఘనీ ముగించారు.

అప్ఘాన్ రాజధాని కాబుల్ లోకి ప్రవేశించిన తాలిబన్లు.. నగరాన్ని చుట్టుముట్టారు. ముందు శాంతిమంత్రం జపిస్తున్నారు. విధ్వంసానికి తెగబడలేదు. దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నుంచి శాంతియుతంగా అధికారాన్ని దక్కించుకోవాలనుకున్నారు. షరతులేవీ విధించలేదు. ఆ దిశగా చర్చలు జరిపారు. రాయబారులను అధ్యక్షుడి భవనానికి పంపారు. ప్రభుత్వం తరఫున అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, జాతీయ రాజీ మండలి (NRC) అధినేత అబ్దుల్లా చర్చలకు హాజరయ్యారు. ఆ తర్వాతే దేశాధ్యక్ష భవనంలోకి తాలిబన్ ప్రవేశించారు. అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. తన పరివారంతో ఘనీ తజికిస్తాన్‌కు వెళ్లినట్టు సమాచారం.
Afghan Airspace Closed :అఫ్గానిస్థాన్ గగనతలం మూసివేత..విమానాల రాకపోకలు నిలిపివేత

దేశంలో ఎవరికి హాని తలపెట్టబోమని తాలిబన్లు ప్రకటించినప్పటికీ అక్కడి ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినవారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దాంతో అక్కడి ప్రజల్లో మరింత భయం పట్టుకుంది. హజరా మైనార్టీలు సైతం తాలిబన్ల రాకతో భయంతో వణికిపోతున్నారు. తాలిబన్లను ఆదేశాలను ధిక్కరించి పలు రంగాల్లో అభివృద్ధి సాధించారు. ఎక్కడా తమపై తాలిబన్లు దాడిచేస్తారేమోనన్న భయంతో సురక్షిత ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబూల్ నగరమంతా ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. తాలిబన్లకు మద్దతుగా వారి నలుపు, తెలుపు జెండాలను పట్టుకొని తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. మిగిలిన వారు ఎవరూ బయట కనిపించడం లేదు. ఇక ఆ దేవుడి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. దేవుడిపై భారం వేసి ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
Afghanistan: బైడెన్ మోసం చేశారంటూ వైట్‌హౌజ్ ఎదుట ఆఫ్ఘ‌న్ల ఆందోళన