ప్లీజ్..మోదీజీ..పాకిస్థాన్ అమ్మాయితో నా పెళ్లి చేయండి..భారత యువకుడి కోరిక
పాకిస్తాన్ అమ్మాయితో తన పెళ్లి జరిగేలా చేయమంటూ ఓ భారత పౌరుడు ప్రధాని నరేంద్ర మోదీని కోరుకున్నాడు. మార్చి నెలలోనే మా వివాహం జరగాల్సి ఉంది.కానీ కరోనాకారణంలో లాక్ డౌన్ విధించటంతో మా పెళ్లి ఆగిపోయిందని..కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే మేమువివాహం చేసుకుంటామని కోరాడు.మాకు ప్రత్యేక అనుమతులు కల్పించి మా పెళ్లి చేయాలని
వివారాల్లోకి వెళితే..పంజాబ్ లోని జలంధర్కు చెందిన కమల్ కళ్యాణ్ పాకిస్తాన్లో నివాసం ఉండే తన సోదరి కూతురు సుమైలాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దీని కోసం2018 జనవరి 26వతేదీన రెండు కుటుంబాలు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. 2020 మార్చి నెలలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దానికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ తో పెళ్లి వాయిదా పడింది.
ఆ తరువాత లాక్ డౌన్ విడతలవారీగా సడలింపులు ఇచ్చినా పొరుగుదేశాల సరిహద్దులు తెరుచుకోకపోవడంతో మా పెళ్లి మరింత ఆలస్యం అవుతూవచ్చింది. దీంతో ప్రధాని మోదీ చొరవ తీసుకొని తమ పెళ్లికి సహకరించాలని వధూవరులు కోరుతున్నారు. తమకు ప్రత్యేకంగా వీసాలు వచ్చేలా చేయాలని వరుడు కమల్ కళ్యాణ్ వధువు సుమైలా కోరుతున్నారు.
సుమైలా పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేలా వీసా మంజూరు చేయాలని కోరుకుంటున్నాననీ..దీనికి సంబంధించిన అన్ని పేపర్లను తాము పూర్తి చేశారని దయచేసి మా వివాహం జరిగేలా చేయమని కమల్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు.
Read: రాందేవ్ కు చిక్కులు..మహారాష్ర్ట వార్నింగ్